కొడంగల్‌లో రేవంత్ అనుచరుల ఇళ్లలో సోదాలు

sivanagaprasad kodati |  
Published : Dec 02, 2018, 07:51 AM IST
కొడంగల్‌లో రేవంత్ అనుచరుల ఇళ్లలో సోదాలు

సారాంశం

టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొడంగల్‌లోని రేవంత్ ప్రధాన అనుచరులైన మహ్మద్ యూసఫ్, నందారం ప్రశాంత్ తదితరుల ఇళ్లలో మఫ్టీలో వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు. 

టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొడంగల్‌లోని రేవంత్ ప్రధాన అనుచరులైన మహ్మద్ యూసఫ్, నందారం ప్రశాంత్ తదితరుల ఇళ్లలో మఫ్టీలో వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు.

సమాచారం అందుకున్న రేవంత్ రెడ్డి అనుచరులను వెంటబెట్టుకుని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులను వెంటబెట్టుకుని తాండూరు-మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తనిఖీలు చేసింది ఎవరో తనకు తెలియజేయాలని అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు