విడాకుల కేసు: కోర్టు ప్రాంగణంలో వియ్యంకుడిపై కానిస్టేబుల్ దాడి

Siva Kodati |  
Published : Jul 01, 2019, 01:37 PM IST
విడాకుల కేసు: కోర్టు ప్రాంగణంలో వియ్యంకుడిపై కానిస్టేబుల్ దాడి

సారాంశం

ఖమ్మం కోర్టు ప్రాంగణంలో సోమవారం పోలీస్ కానిస్టేబుల్ హలచల్ చేశాడు.  ఓ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. కుమార్తె విడాకుల విషయంలో కోర్టుకు హాజరై వస్తున్న వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు. 

ఖమ్మం కోర్టు ప్రాంగణంలో సోమవారం పోలీస్ కానిస్టేబుల్ హలచల్ చేశాడు.  ఓ వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. కుమార్తె విడాకుల విషయంలో కోర్టుకు హాజరై వస్తున్న వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడి చేశాడు.

సదరు హెడ్ కానిస్టేబుల్ కొడుకుతో అబ్బనపురి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  2018లో తన కూతురి పెళ్లి చేశాడు. అయితే దంపతుల మధ్య కొద్దిరోజులకే మనస్పర్థలు రావడంతో న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ వేశాడు కానిస్టేబుల్ కుమారుడు.

ఈ కేసులో విచారణకు హాజరై వస్తున్న వెంకటేశ్వర్లును హెడ్ కానిస్టేబుల్ అడ్డగించి.. విచక్షణారహితంగా వారిపై దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే