భర్తపై వడ్డీ వ్యాపారి ఆగడాలు.. వేధింపులు తట్టుకోలేక పుస్తెలతాడు తీసిచ్చిన భార్య..

By AN TeluguFirst Published Aug 5, 2021, 10:57 AM IST
Highlights

 ఓ రోజు నాగరాజును వడ్డీ వ్యాపారి తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి పట్టుకుని చావబాది వదిలేశాడు. మరో రోజు నాగరాజు ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలని వడ్డీ వ్యాపారి గొడవపెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి తన భర్తను వేదింపులకు గురిచేస్తోన్న తీరును చూసి నాగరాజు భార్య అఖిల భరించలేకపోయింది. 

నిజామాబాద్ : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని నాగరాజు (30) అనే వ్యక్తిని వేధించసాగాడు శ్రీనివాస్ అనే ఓ వడ్డీ వ్యాపారి. కరోనా వల్ల ఆదాయం లేకుండాపోయిందని, తర్వాత ఇస్తానని నాగరాజు చెబుతూ వస్తున్నాడు. అయితే, డబ్బు వెంటనే చెల్లించాలని, నాగరాజు కొత్త బైకును లాక్కు వెళ్లాడు వడ్డీ వ్యాపారి.

అంతేగాక, ఓ రోజు నాగరాజును వడ్డీ వ్యాపారి తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి పట్టుకుని చావబాది వదిలేశాడు. మరో రోజు నాగరాజు ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలని వడ్డీ వ్యాపారి గొడవపెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారి తన భర్తను వేదింపులకు గురిచేస్తోన్న తీరును చూసి నాగరాజు భార్య అఖిల భరించలేకపోయింది. 

తన మెడలోకి బంగారు పుస్తెలతాడు తీసి వడ్డీ వ్యాపారికి ఇచ్చింది అఖిల. తన భార్య పుస్తెల తాడు ఇవ్వడంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఫ్యానుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

మృతుడు నవాతే నాగరాజు స్థానిక గంజ్ లో గుమాస్తాగా పనిచేసేవాడు. వ్యాపార నిమిత్తం జిల్లాలోని కమ్మర్ పల్లి మండలం కోనాసముందర్ గ్రామానికి చెందిన బాదం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రెండేళ్ల క్రితం రూ. లక్షా 20 వేలు అప్పుగా తీసుకుని తిరిగి డబ్బు చెల్లించలేకపోయాడు. అందుకే నాగరాజును శ్రీనివాస్ వేదించసాగాడని అఖిల బంధువులు చెప్పారు. 

click me!