తెలంగాణ ప్రజలు మార్పును కోరుకొంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Published : Nov 20, 2020, 03:57 PM ISTUpdated : Nov 20, 2020, 04:25 PM IST
తెలంగాణ ప్రజలు మార్పును  కోరుకొంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సారాంశం

తెలంగాణ ప్రజలు కూడ మార్పును కోరుకొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు గాను దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను ఆయన నిదర్శనంగా చెప్పారు.

హైదరాబాద్:తెలంగాణ ప్రజలు కూడ మార్పును కోరుకొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు గాను దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను ఆయన నిదర్శనంగా చెప్పారు.

శుక్రవారం నాడు నాదెండ్ల మనోహర్ నివాసంలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత డాక్టర్ లక్ష్మణ్ గంటపాటు చర్చించారు.ఈ భేటీకి సంబంధించిన చర్చల విషయాలను కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు.

also read:తెలంగాణలో కూడా బీజేపీతోనే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు:తేల్చేసిన పవన్

హైద్రాబాద్ లో మంచి పరిపాలన రావాలని హైద్రాబాద్ ప్రజలు కోరుకొంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ ద్వారానే మార్పు వస్తోందని ప్రజలు భావిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

ఈ విషయమై తమకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరామన్నారు. ఇందుకు సహకరించేందుకు పవన్ కళ్యాణ్  అంగీకరించారని ఆయన వివరించారు.గ్రాఫిక్స్ తో కాకుండా గ్రౌండ్ రియాలిటీతో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.బీజేపీ విజయానికి తన సంపూర్ణ సహకారం అందిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu