ఏపీలో కేసీఆర్ చిత్రపటానికి మరోసారి పాలాభిషేకం

Published : Oct 11, 2018, 04:47 PM IST
ఏపీలో కేసీఆర్ చిత్రపటానికి మరోసారి పాలాభిషేకం

సారాంశం

కేసీఆర్‌ను అవమానిస్తే సహించబోమని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆయన అభిమానులు హెచ్చరించారు

ఏపీలో కేసీఆర్ చిత్రపటానికి మరోసారి పాలాభిషేకం చేశారు. ఇటీవల ఏపీలో కొందరు నేతలు కేసీఆర్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి అవమానించారు. దీనిపై విజయవాడలోని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ను అవమానిస్తే సహించబోమని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆయన అభిమానులు హెచ్చరించారు.ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందుకుగాను కేసీఆర్‌ చిత్రపటానికి అభిషేకం చేసి.. మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో కూడా ఏపీలో కొందరు అభిమానంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Rashmika Mandanna Speeh: లైఫ్ అంటే అదే.. స్టేజిపై స్పీచ్ ఇరగదీసిన రష్మిక | Asianet News Telugu