బతుకమ్మ పూల కోసం వెళితే కరెంట్ షాక్...ఓ వ్యక్తి దుర్మరణం

Published : Oct 17, 2018, 03:49 PM ISTUpdated : Oct 17, 2018, 03:51 PM IST
బతుకమ్మ పూల కోసం వెళితే కరెంట్ షాక్...ఓ వ్యక్తి దుర్మరణం

సారాంశం

సద్దుల బతుకమ్మ సంబరాలు జరగాల్సిన ఓ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన గ్రామస్థులు దుఖ:లో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

సద్దుల బతుకమ్మ సంబరాలు జరగాల్సిన ఓ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన గ్రామస్థులు దుఖ:లో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఇవాళ తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగ ఉండటంతో  జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బండారు రాజయ్య(52) బతుకమ్మ పూల కోసం పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఓ పొలంలో ప్రవేశించిన అతడు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన కరెంట్ తీగలను గమనించలేదు. దీంతో ప్రమాదవశాత్తు ఆ తీగలకు రాజయ్య తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మఈతి చెందాడు.

 రాజయ్య మరణ వార్త తెలియడంతో గ్రామంతో పండగ వాతావరణం మాయమై విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ