బతుకమ్మ పూల కోసం వెళితే కరెంట్ షాక్...ఓ వ్యక్తి దుర్మరణం

Published : Oct 17, 2018, 03:49 PM ISTUpdated : Oct 17, 2018, 03:51 PM IST
బతుకమ్మ పూల కోసం వెళితే కరెంట్ షాక్...ఓ వ్యక్తి దుర్మరణం

సారాంశం

సద్దుల బతుకమ్మ సంబరాలు జరగాల్సిన ఓ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన గ్రామస్థులు దుఖ:లో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

సద్దుల బతుకమ్మ సంబరాలు జరగాల్సిన ఓ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన గ్రామస్థులు దుఖ:లో మునిగిపోయారు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఇవాళ తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగ ఉండటంతో  జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బండారు రాజయ్య(52) బతుకమ్మ పూల కోసం పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఓ పొలంలో ప్రవేశించిన అతడు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన కరెంట్ తీగలను గమనించలేదు. దీంతో ప్రమాదవశాత్తు ఆ తీగలకు రాజయ్య తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మఈతి చెందాడు.

 రాజయ్య మరణ వార్త తెలియడంతో గ్రామంతో పండగ వాతావరణం మాయమై విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu