గాంధీలో ఖైదీల పరారీ: ఒకరి అరెస్ట్, మిగతా ముగ్గురి జాడ పట్టిన పోలీసులు

By Siva KodatiFirst Published Oct 10, 2020, 3:12 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రిల ఖైదీల పరారీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పారిపోయిన నలుగురు ఖైదీలలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రిల ఖైదీల పరారీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పారిపోయిన నలుగురు ఖైదీలలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ పోలీసులు.

ఖైదీ సోమ సుందర్ నుంచి 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఖైదీల నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఆ ముగ్గురు ఖైదీలు గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించింది. దీంతో పోలీసుల బృందం కర్ణాటకకు వెళ్లింది.

చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో ఆగస్టు 27న వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో వారు పోలీసులు, వైద్య సిబ్బంది కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారయ్యారు. 

click me!