మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీసులో పనిచేసే యువకుడి ఆత్మహత్య..

Published : Aug 28, 2022, 03:42 PM IST
మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీసులో పనిచేసే యువకుడి ఆత్మహత్య..

సారాంశం

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని మంత్రి కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న దేవేందర్‌గా గుర్తించారు. వివరాలు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలోని ఓ గదిలో దేవేందర్ ఉరివేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మార్గమధ్యలోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. 

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. దేవేందర్ ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెకు తాను చనిపోతున్నానని మెసేజ్ పంపినట్టుగా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు. ఇక, దేవేందర్ అర్ధరాత్రి వరకు ఆమెతో ఫోన్‌లో చాట్ చేసిన తర్వాత ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu