ఆపద్దర్మ ప్రభుత్వ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ

Published : Sep 06, 2018, 03:12 PM ISTUpdated : Sep 09, 2018, 12:27 PM IST
ఆపద్దర్మ ప్రభుత్వ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ

సారాంశం

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ రద్దుపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ నిజం చేశారు. 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ రద్దయింది.   

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ రద్దుపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ నిజం చేశారు. 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ రద్దయింది. 

అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ ను కలిశారు. ఈ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను గవర్నర్ కోరారు. ఈ  మేరకు ఆపద్దర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి నోటిఫికేషన్‌ జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలను అనుసరించి ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గం ఈ ఆపద్దర్మ ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఈ జీవోలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆపద్దర్మ ప్రభుత్వం పాలన సాగనుంది.

అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu