మళ్లీ వార్తల్లోకి కేఏపాల్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

By telugu teamFirst Published Aug 19, 2019, 2:59 PM IST
Highlights

కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ మిగితా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరుకాలేదు. 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన సమయంలో నానా హంగామా చేసిన కేఏపాల్... ఫలితాల అనంతరం కనిపించకుండా పోయారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.

కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ మిగితా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరుకాలేదు. దీంతో మహబూబ్ నగర్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా... ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!