మళ్లీ వార్తల్లోకి కేఏపాల్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Published : Aug 19, 2019, 02:59 PM ISTUpdated : Aug 19, 2019, 05:59 PM IST
మళ్లీ వార్తల్లోకి కేఏపాల్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

సారాంశం

కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ మిగితా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరుకాలేదు. 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన సమయంలో నానా హంగామా చేసిన కేఏపాల్... ఫలితాల అనంతరం కనిపించకుండా పోయారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.

కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ మిగితా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరుకాలేదు. దీంతో మహబూబ్ నగర్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా... ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?