కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

First Published Feb 26, 2019, 3:07 PM IST

: పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతాంగం దేశాన్ని తమ ఆందోళన వైపుకు తిప్పేలా ప్లాన్ చేస్తున్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలను అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారు

పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతాంగం దేశాన్ని తమ ఆందోళన వైపుకు తిప్పేలా ప్లాన్ చేస్తున్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలను అస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారు. గతంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం నల్గొండ జిల్లా వాసులు చూపిన బాటలోనే నిజామాబాద్ వాసులు కూడ పయనించాలని భావిస్తున్నారు.
undefined
పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సుమారు 20 రోజులుగా రైతులు జేఎసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు. పసుప పంట పండించేందుకు కనీసంగా ఎకరానికి రూ.9వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.కానీ, క్వింటాల్ పసుపుకు కేవలం రూ.4500 కంటే ఎక్కువ ధర రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
undefined
ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని క్వింటాల్ పసుపుకు రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నారు. పసుపుతో పాటు జొన్నకు కూడ గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. అయితే పాలకులు పట్టించుకోవడం లేదని జేఎసీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ సుమారు 1000 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు.
undefined
ప్రపంచంలోని పలు ప్రాంతాలకు దేశం నుండి పసుపు ఎగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో సమారు 60 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తారు. 2017-18లో తెలంగాణ నుండి దేశ సగటులో సుమారు 13 శాతం పసుపు విదేశాలకు ఎగుమతి అయినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆమె మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
undefined
పసుపు రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని 20 రోజులకు పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయమై పాలకులు పట్టించుకోకపోవడంతో రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
undefined
సుమారు 200 గ్రామాల నుండి వెయ్యి మంది రైతులు వచ్చే పార్లమెుంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా స్వతంత్రులుగా పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుస్తామనే భావనతో రైతులు పోటీకి దిగడం లేదు. కానీ, పసుపు రైతుల ఆందోళన, నిరసనను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను పోటీ చేయాలని రైతులు భావిస్తున్నారు.
undefined
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను అవసరమయ్యే నామినేషన్ ఫీజు కోసం తమ గ్రామ అభివృద్ధి కమిటీల నుండి రూ.5 నుండి 10 వేలను వసూలు చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకొంది.
undefined
నిజామాబాద్ రైతాంగం నల్గొండ జిల్లాను ఆదర్శంగా తీసుకొన్నారు. ఎస్‌ఎల్ బీసీ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలనే డిమాండ్‌తో 1996 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుండి జలసాధన సమితి ఆధ్వర్యంలో 480 మంది నామినేషన్లు దాఖలు చేశారు.ఆ సమయంలో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరిగేవి.
undefined
అంత పెద్ద సైజులో బ్యాలెట్ పేపర్ ముద్రణకు ఇబ్బందయ్యే అవకాశం ఉండడంతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికను నిర్వహించకుండా ఎన్నికను వాయిదా వేశారు. రాష్ట్రం మొత్తం ఎన్నికలు పూర్తైన నెల రోజుల తర్వాత నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి.
undefined
480 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న భారీ సైజు బ్యాలెట్ పేపర్లో కూడ ఓటర్లు అతి జాగ్రత్తగా ఓటు చేశారు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం రెండోసారి ఆ స్థానం నుండి విజయం సాధించారు.ఇంత భారీ సైజు బ్యాలెట్ ఉన్నా కూడ చెల్లని ఓట్లు అతి తక్కువగా ఆ ఎన్నికల్లో నమోదయ్యాయి.
undefined
480 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న భారీ సైజు బ్యాలెట్ పేపర్లో కూడ ఓటర్లు అతి జాగ్రత్తగా ఓటు చేశారు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షం రెండోసారి ఆ స్థానం నుండి విజయం సాధించారు.ఇంత భారీ సైజు బ్యాలెట్ ఉన్నా కూడ చెల్లని ఓట్లు అతి తక్కువగా ఆ ఎన్నికల్లో నమోదయ్యాయి.
undefined
ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు నిర్మాణం కోసం నల్గొండ వాసులు అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసనను దేశ వ్యాప్తంగా చూపెట్టారు. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కాకుండా ఉండేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ ఫీజును కూడ ఈ ఎన్నికల తర్వాత పెంచింది.
undefined
నల్గొండ వాసులు చూపిన దారిలోనే పోలేపల్లి సెజ్ బాధితులు కూడ 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి 16 మంది పోటీ చేశారు. ఆ సమయంలో పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ మధు కాగుల నేతృత్వంలో వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు. సెజ్ బాధితులంతా వారంతపు సంతల్లో ప్రచారాన్ని నిర్వహించి ఓట్లు అడిగారు.
undefined
సెజ్ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తో సెజ్ బాధితులు ఆ సమయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ విజయం సాధించారు.
undefined
click me!