చేపల వేటకెళ్లి.. వాగులో ఇరుక్కుని, చెట్టుపై ఎదురుచూపులు.. ముగ్గురిని రక్షించిన రెస్క్యూ టీమ్

Siva Kodati |  
Published : Jul 28, 2022, 08:24 PM IST
చేపల వేటకెళ్లి.. వాగులో ఇరుక్కుని, చెట్టుపై ఎదురుచూపులు.. ముగ్గురిని రక్షించిన రెస్క్యూ టీమ్

సారాంశం

కామారెడ్డి జిల్లా శెట్‌పల్లిలో వాగులో చిక్కుకున్న ముగ్గురిని రక్షించాయి సహాయక బృందాలు . చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో వాగులోని ఓ చెట్టును పట్టుకుని ఎక్కారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యంగా వుండాలన్నారు.

కామారెడ్డి జిల్లా శెట్‌పల్లిలో వాగులో చిక్కుకున్న ముగ్గురిని రక్షించాయి సహాయక బృందాలు. తాడు సాయంతో ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు సిబ్బంది. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో వాగులోని ఓ చెట్టును పట్టుకుని ఎక్కారు. అనంతరం సాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యంగా వుండాలన్నారు. అనంతరం వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు ముగ్గురిని కాపాడాయి. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే