పిల్లల రహస్యం: టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అనర్హత వేటు

Published : Jul 03, 2019, 05:14 PM IST
పిల్లల రహస్యం: టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అనర్హత వేటు

సారాంశం

 ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించిన టీఆర్ఎస్‌ కార్పోరేటర్‌పై   నాంపల్లి కోర్టు అనర్హత వేటేసింది. బీజేపీకి చెందిన  మాజీ కార్పోరేటర్ ఉమాదేవి భర్త రమేష్ యాదవ్  పిటిషన్‌పై బుధవారం నాడు  కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

హైదరాబాద్: ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించిన టీఆర్ఎస్‌ కార్పోరేటర్‌పై   నాంపల్లి కోర్టు అనర్హత వేటేసింది. బీజేపీకి చెందిన  మాజీ కార్పోరేటర్ ఉమాదేవి భర్త రమేష్ యాదవ్  పిటిషన్‌పై బుధవారం నాడు  కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు పిల్లలున్నా టీఆర్ఎస్ అభ్యర్ధి ఎక్కాల కన్నా చైతన్య ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని దాచేశారు.  నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు పిల్లలు ఉన్నారని బీజేపీ నేత రమేష్ యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కన్నా చైతన్యకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టినట్టుగా  విచారణలో తేలింది.దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.కన్నా చైతన్య తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్ధిని కార్పోరేటర్ గా కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో  ఉమా రమేష్  వర్గీయులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్