మునుగోడు బైపోల్ 2022: పన్నెండో రౌండ్‌లో కారు జోరు,కమలం బేజారు

By narsimha lodeFirst Published Nov 6, 2022, 3:54 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ లో పన్నెండో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. నాలుగో రౌండ్  నుండి  12   రౌండ్  వరకు  ఆయన  లీడ్ లోనే ఉన్నారు.
 

మునుగోడు:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో పన్నెండో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆదిక్యంలో నిలిచారు.12వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 7,440 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 5,398 ఓట్లు వచ్చాయి.

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ నుండి పన్నెండో రౌండ్  వరకు టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ  కేవలం  2,3 రౌండ్లలో మాత్రమే లీడ్ లో నిలిచింది.12 రౌండ్లు  పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 81,817 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 74,169 ఓట్లు వచ్చాయి.  కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 21,218 ఓట్లు వచ్చాయి.పన్నెండు  రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్  అభ్యర్ధి  బీజేపీ అభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డిపై 7836 ఓట్ల ఆధిక్యంలో  నిలిచారు.

alsoread:మునుగోడు బైపోల్ 2022: పదకొండో రౌండ్‌లో కారు జోరు

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

click me!