ఆడపిల్లల్ని కన్నందుకు అత్తింటివారి వేధింపులు...ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

Published : Aug 28, 2018, 03:23 PM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
ఆడపిల్లల్ని కన్నందుకు అత్తింటివారి వేధింపులు...ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

సారాంశం

ఆడ పిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన పాపం. వరుసగా రెండోసారి ఆడ శిశువు పుట్టడంతో ఆ మహిళపై అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిని తట్టుకోలేకపోయిన ఆ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.   

ఆడ పిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన పాపం. వరుసగా రెండోసారి ఆడ శిశువు పుట్టడంతో ఆ మహిళపై అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఆ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబుగాం గ్రామానికి చెందిన ఆడె సంతోష్ కు మూడేళ్లక్రితం సుశీలబాయితో వివాహమైంది. అయితే ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ పిల్ల పుట్టింది. దీంతో భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. అయితే రెండు నెలల క్రితం ఈమె రెండో సారి కూడా ఆడపిల్లకే జన్మనిచ్చింది. దీంతో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. 

సుశీల ఈ వేధింపులను తట్టుకోలేక పోయింది.  దీంతో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు తన చేతులతోనే విషమిచ్చి చంపిన ఆ తల్లి వారు చనిపోయాక తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది.  స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో భైంసా డీఎస్పీ రాములు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
  
 

PREV
click me!

Recommended Stories

Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu