కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూ. 38వేల కోట్లు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

By narsimha lodeFirst Published Feb 2, 2023, 5:22 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రంలో  బీబీనగర్, సింగరేణి  వంటి సంస్థలకు  బడ్జెట్ లో  అధిక ప్రాధాన్యత ఇచ్చిందని  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్  చెప్పారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం  బడ్జెట్ లో   రాష్ట్రానికి  రూ. 38 వేల కోట్ల కేటాయించిందని   బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్  చెప్పారు. గురువారం నాడు న్యూఢిల్లీలో  ఎంపీ  లక్ష్మణ్  మీడియాతో మాట్లాడారు.  వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా  రూ. 10, 500 కోట్లు కేటాయంచిందన్నారు.బీబీనగర్ ఎయిమ్స్ , సింగరేణి సంస్థలకు  కేంద్ర బడ్జెట్ లో  నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు.   మోడీ ప్రభుత్వం  అనుసరిస్తున్న విధానాలతో  ప్రపంచం మొత్తం  భారత్ వైపు చూస్తుందని  ఆయన  చెప్పారు.  

click me!