రైల్లో పుట్ బోర్డింగ్...ప్రమాదానికి గురై యువకుడి మృతి

First Published Aug 7, 2018, 3:00 PM IST
Highlights

బస్సుల్లోనూ, రైళ్లలోనూ విద్యార్థులు, యువకులు ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని ప్రయాణిస్తుంటారు. దాన్ని సరదాగా భావిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇలా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో ఇతరులు చెబుతున్నా వినిపించుకోరు. ఈ పుట్ బోర్డింగ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ యువకుడు రైల్లో పుట్ బోర్డింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మరణించాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

బస్సుల్లోనూ, రైళ్లలోనూ విద్యార్థులు, యువకులు ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని ప్రయాణిస్తుంటారు. దాన్ని సరదాగా భావిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇలా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో ఇతరులు చెబుతున్నా వినిపించుకోరు. ఈ పుట్ బోర్డింగ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ యువకుడు రైల్లో పుట్ బోర్డింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మరణించాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లో సిటీ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైల్లు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణికులతో కిక్కిరిసి ప్రయాణిస్తుంటాయి. ఇలా రద్దీ సమయంలో నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ యువకుడు రైలెక్కాడు. అతడు రైలు ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తూ హపీజ్ పేట్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. రైల్లోంచి కిందపడిపోడటంతో తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.   

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి యువకుడు చనిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!