టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం: బైఠాయింపు

Published : Feb 24, 2020, 11:46 AM IST
టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి చేదు అనుభవం: బైఠాయింపు

సారాంశం

టౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. టోల్ ఫీజు చెల్లించి వెళ్లాలని వారు ఎమ్మెల్సీని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన నర్సిరెడ్డి టోల్ ప్లాజా వద్ద బైఠాయించారు.

చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.  సిబ్బంది అత్యుత్సాహంతో  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు.టోల్ ఫీజ్ చెల్లించి వెళ్లాలని సిబ్బంది పట్టుబట్టారు. 

తాను ఎమ్మెల్సీనని చెప్పి.. ఐడి కార్డు చూపించినా వారు అనుమతించలేదు. గన్ మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అనుకోలేదని మొదట సిబ్బంది చెప్పారు. తర్వాత టోల్ మినహాయింపు జాబితా లో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. సమాచారం తెలిసి అనుమతించాలని ఉన్నతాధికారుల ఆదేశించారు. 

అసలు ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని నర్సిరెడ్డి పట్టుబట్టారు. సిబ్బంది తీరుకు నిరసనగా టోల్ ఫ్లాజా వద్ద ఆయన బైఠాయించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే