ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు: తేనేటీగల దాడి నుండి తప్పించుకున్న రాజయ్య

By narsimha lodeFirst Published Mar 13, 2023, 5:30 PM IST
Highlights

మాజీ డిప్యూటీ సీఎం  తాటికొండ రాజయ్య  తృటిలో ప్రమాదం  నుండి తప్పించుకున్నారు. తేనేటీగల దాడి నుండి  ఆయన సురక్షితంగా బయటపడ్డారు.  

వరంగల్: స్టేషన్ ఘన్ పూర్  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు  సోమవారంనాడు   తృటిలో  ప్రమాదం  తప్పింది .  తేనేటీగల దాడి నుండి  రాజయ్య  సురక్షితంగా బయటపడ్డాడు. వెంటనే తన వాహనంలో  ఎమ్మెల్యే రాజయ్య  ఘటన స్థలనం నుండి వెళ్లిపోయాడు.

జిల్లాలోని ఉప్పుగల్  వద్ద  జరిగిన  బోనాల ఉత్సవాలకు  ఎమ్మెల్యే  రాజయ్య  ఇవాళ  హాజరయ్యారు. అయితే  ఈ సమయంలో  దివిటీలను వెలిగించారు.  ఈ ప్రాంతంలో  తేనేటీగలున్నాయి.   దివిటీలు వెలిగించడంతో  తేనేటీగలు  ఒక్కసారిగా  అక్కడున్నవారిపై  దాడికి దిగాయి.ఈ విషయాన్ని  గుర్తించిన  స్థానికులు  ఎమ్మెల్యేను అప్రమత్తం  చేశారు. ఎమ్మెల్యే  రాజయ్య  వెంటనే తన వాహనంలో  అక్కడి నుండి  కారులో  వెళ్లిపోయారు.  ఈ  సమయంలో  అక్కడే   ఉన్న కొందరు  తేనేటీగల  దాడిలో  స్వల్పంగా గాయపడ్డారు. 

click me!