భారీ వర్షాలతో 2,222 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం.. అధికారులకు మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు..

Published : Jul 13, 2022, 06:32 PM ISTUpdated : Jul 13, 2022, 06:36 PM IST
భారీ వర్షాలతో 2,222 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం.. అధికారులకు మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు..

సారాంశం

తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని 2,222 గ్రామాల్లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కు తీవ్ర ఆటంకం కలిగింది.  

తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులతో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో గల తన నివాసంలో రాష్ట్రంలోని వరదల పరిస్థితిని సమీక్షించారు. 

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయి. ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్ జిల్లాల్లో 2,222 గ్రామాల్లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా కు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల ప్రజలకు వెంటనే నీటి సరఫరా చేయగలిగే అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆ గ్రామాలకు నీటి సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు.

రాష్ట్రంలో కోతలకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు సేకరించాలని..వాటి పునరుద్ధరణ, మరమ్మతుల చర్యలకు ఉపక్రమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అదేశించారు. పంచాయతీ రాజ్ రోడ్ల సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా పెడుతున్నామని మంత్రి చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, వర్షాకాల సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశిచారు. వెంటనే జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు.

ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.  ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అలెర్ట్ గా ఉండాలన్నారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. 

అదే విధంగా గత ఏడాది వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని సూచించారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలకు ఏ విధమైన నష్టం లేకుండా చూడాలన్నారు. భారీగా వర్షం పడుతున్న సమయంలో ముందు జాగ్రత్తగా చర్యగా తాత్కాలికంగా ఆ ప్రాంతాలో విద్యుత్ ను నిలిపివేసి నష్టాన్ని నివారించాలని అన్నారు. వరద నష్ఠాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, వరంగల్ నగర పాలక సంస్థ కార్యలయంలో ఏర్పాటు చేయాలని అయన ఆదేశించారు. ప్రజలు సైతం వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని, రోడ్ల మీదకు రావద్దని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు