Uttam Kumar Reddy: "కాళేశ్వరంపై దర్యాప్తు చేపడుతాం.. బాధ్యులను వదిలి పెట్టబోం.."

Published : Dec 12, 2023, 04:45 AM IST
Uttam Kumar Reddy: "కాళేశ్వరంపై దర్యాప్తు చేపడుతాం.. బాధ్యులను వదిలి పెట్టబోం.."

సారాంశం

Uttam Kumar Reddy: నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహిం చారు. పెండింగ్, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని, నిర్మాణం, డిజైన్‌తో సంబంధం ఉన్న వారినే బాధ్యులని  మంత్రి అన్నారు. 


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే దర్యాప్తునకు ఆదేశిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్  రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు నెల క్రితం మేడిగడ్డ బ్యారేజీలో స్తంభాలు కూలిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ అండ్‌ క్యాడ్‌) శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

పెండింగ్, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ఈఎన్ సీ మురళీధర్ రావు వివరించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్  మీడియాతో మాట్లాడుతూ..  త్వరలోనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, కేబినెట్‌ సమావేశంలో లోపాలను కూలంకషంగా చర్చించి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) కింద 70 వేల ఎకరాలకు పైగా స్థిరీకరణ జరిగిందని అధికారులు ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పడంతో మంత్రి ఆశ్చర్యపోయారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని, నిర్మాణం, డిజైన్‌తో సంబంధం ఉన్న వారినే బాధ్యులని అన్నారు. 

ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత దాని కిందకు వచ్చిన కొత్త ఆయకట్ కాకుండా ప్రాజెక్టు సాధ్యత, దాని కోసం ఖర్చు చేసిన మొత్తం అందించాలని ఉత్తమ్ కుమార్ అధికారులను కోరారు. తాను త్వరలో ఖమ్మం జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శిస్తానని, సంబంధిత సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.


ప్రజా ధనాన్ని వినియోగించి ప్రాజెక్టులను నిర్మించడంలో పూర్తి పారదర్శకత అవసరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి బిఆర్‌ఎస్ అత్యంత గోప్యంగా ఉందని, రహస్యంగా కొన్ని జిఓలు జారీ చేస్తోందని ఆరోపించారు. డిపార్ట్‌మెంట్‌లో రహస్యంగా ఏదో జరుగుతోందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు.

కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటాను పొందేందుకు తెలంగాణ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ హయాంలో ఎలాంటి తిరుగుండదని, గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పిఎల్‌ఐఎస్) జాతీయ హోదా కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల చెరువులను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు వాటి పరిధిలోని ఆయకట్టులను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.6,400 కోట్ల ఖర్చు జరిగిందని, ఇటీవల ఒక పిల్లర్ 1.2 మీటర్ల మేర కుంగిందని తెలిపారు. దీంతో మరో 3 పిల్లర్లపై ప్రభావం పడిందనీ,  పిల్లర్లు కుంగిన వెంటనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశామని, నీరు తొలగింపు తర్వాత పిల్లర్లు కుంగడం ఆగిపోయిందని అధికారులు  మంత్రికి తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain In Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం| Asianet News Telugu
IMD Rain Alert : ఈ రాత్రి భారీ వర్షాలు, వడగళ్ల బీభత్సం.. ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్