వనస్థలిపురంలో డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభం.. 184 మందికి ఇళ్ల పట్టాలిచ్చిన కేటీఆర్..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 16, 2020, 12:35 PM IST
వనస్థలిపురంలో డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభం.. 184 మందికి ఇళ్ల పట్టాలిచ్చిన కేటీఆర్..

సారాంశం

హైదరాబాద్ లోని వనస్థలిపురం రైతుబజార్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అయ్యాయి.  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు. 

హైదరాబాద్ లోని వనస్థలిపురం రైతుబజార్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అయ్యాయి.  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ 184 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. రూ.28 కోట్లతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. 9 అంతస్తుల్లో మూడు బ్లాక్ లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి గృహ ప్రవేశం చేస్తున్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇప్పుడు డబుల్ బెడ్ రూంలు నిర్మించబడిన ఈ ప్రాంతంలో ఐదేళ్ల కిందట ఈ రెండెకరాల స్థలం అపరిశుభ్రమైన వాతావరణం ఉండేది. 

స్థానిక నేత జిట్టా రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇక్కడ డబుల్ బెడ్ రూం. ఇల్లు శాంక్షన్ చేయించాం. ప్రైవేట్ బిల్డర్ కడితే ఎంత నాణ్యంగా ఉంటాయో ఆ స్థాయిలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కంపెనీ లిఫ్ట్ లాంటి అనేక సౌకర్యాలతో కట్టించామని అన్నారు.

ఇలాంటి ఇండ్లు దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పుకొచ్చారు. 40,50 లక్షల విలువైన అపార్ట్ మెంట్ ఒక్కొక్కటి అని అన్నారు. లక్ష ఇండ్లు దాదాపు పూర్తయ్యాయని... ఇప్పటికి పదివేల ఇండ్లు ఇచ్చేశామని మిగతావి చివరి దశలో ఉన్నాయని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu