ధర్మపురి బ్రహ్మోత్సవాలు... ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కొప్పుల ఈశ్వర్

Published : Mar 11, 2019, 08:27 PM IST
ధర్మపురి బ్రహ్మోత్సవాలు... ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కొప్పుల ఈశ్వర్

సారాంశం

తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంంభంకానున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. 

తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంంభంకానున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. 

సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కొప్పుల ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ పాలకమండలి తరపున బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందించారు.   
  
ధర్మపురిలో ఈ నెల 17నుండి 29వ తేదీ వరకు జరిగే లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారు. ఇలా భక్తులు తమ మొక్కులను తీర్చుకుని స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు. దీంతో భక్తులతో కిటకిటలాడుతూ ఏటా ఈ నెలలో ధర్మపురి జనసంద్రంగా మారుతుంది.   
 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.