తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లి కారు పూర్తిగా ధ్వంసమైంది.
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లి కారు పూర్తిగా ధ్వంసమైంది. మంత్రి కారుకి ట్రాక్టర్ దమ్ము చక్రాలు తగలడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వెలిశాల- కొడకండ్ల మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.