రెండు మూడు రోజుల్లో పాతబస్తీ మెట్రో పనులు ప్రారంభం : ఎన్వీఎస్ రెడ్డి

Published : Aug 25, 2018, 05:19 PM ISTUpdated : Sep 09, 2018, 01:53 PM IST
రెండు మూడు రోజుల్లో పాతబస్తీ మెట్రో పనులు ప్రారంభం : ఎన్వీఎస్ రెడ్డి

సారాంశం

మెట్రో పనులు అన్ని చోట్లా వేగవంతంగా జరరుగుతున్నా పాతబస్తీలో మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేవు. దీంతో ఈ మార్గంలో అసలు మెట్రో పరుగులు ఉంటాయా అని నగర వాసుల్లో అనుమానం కూడా మొదలైంది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ త్వరలోనే పాతబస్తీ ప్రాంతంలో మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

హైదరాబాద్ నగర ప్రజల రవాణా కష్టాలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం పిపిపి(పబ్లిక్ ప్రైవేట్ బాగస్వామ్యం) పద్దతిలో చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మెట్రో. ఇప్పటికే మియాపూర్ నుండి నాగోల్ వరకు మెట్రో రైలు పరుగెడుతోంది. అలాగే అమీర్ పేట్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. ఇక హైటెక్ సిటి మార్గంతో పాటు జెబియస్ నుండి ఎంజిబిఎస్ వరకు ఈ మెట్రో పనులు ఆటంకం లేకుండా జరుగుతున్నాయి. 

అయితే ఈ మెట్రో పనులు అన్ని చోట్లా వేగవంతంగా జరరుగుతున్నా పాతబస్తీలో మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేవు. దీంతో ఈ మార్గంలో అసలు మెట్రో పరుగులు ఉంటాయా అని నగర వాసుల్లో అనుమానం కూడా మొదలైంది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ త్వరలోనే పాతబస్తీ ప్రాంతంలో మెట్రో పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఎంజిబిఎస్ నుండి ఫలక్ నుమా వరకు చేపట్టనున్న పెట్రో పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎంఐఎం ప్లోర్ లీడర్ అక్బరుద్దిన్ ఓవైసి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాతో కలిసి పాతబస్తీలో చేపట్టనున్న మెట్రో మార్గాన్ని పరిశీలించారు.  

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌