అంబులెన్స్ ధరలు భరించలేక.. టూ వీలర్ పై తండ్రి మృతదేహం తరలింపు...!!

Published : May 29, 2021, 01:08 PM ISTUpdated : May 29, 2021, 01:09 PM IST
అంబులెన్స్ ధరలు భరించలేక.. టూ వీలర్ పై తండ్రి మృతదేహం తరలింపు...!!

సారాంశం

రాజస్థాన్ లో అంబులెన్స్ ఖర్చు భరించలేక కరోనాతో చనిపోయిన కూతురు మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన ఘటన మరువకముందే తెలంగాణలో అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. 

రాజస్థాన్ లో అంబులెన్స్ ఖర్చు భరించలేక కరోనాతో చనిపోయిన కూతురు మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన ఘటన మరువకముందే తెలంగాణలో అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. 

ఖమ్మలోని ఆత్కూరు సమీపంలో అనారోగ్యంతో చనిపోయిన ఓ వృద్ధుడిని టూ వీలర్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. 

వివరాల్లోని వెడితే..మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ (70) అనే వృద్ధుడు వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించారు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో.. కుటుంబసభ్యులు అతడిని మోటార్ సైకిల్ మీద మధిరకు తీసుకువస్తున్నారు. 

మార్గమద్యంలో సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆస్పత్రిలో వైద్యం చేయించాలని సూచించాడు. దీంతో మోటార్ సైకిల్ మీదే మధిరకు తీసుకెల్తుండగా ఆత్కూరు దగ్గరికి వచ్చేసరికి.. ఒక్కసారిగా గుండెపోటు ఎక్కువవ్వడంతో మోటార్ సైకిల్ మీదే మృతి చెందాడు. 

వైరల్ : కరోనాతో చనిపోయిన కూతురు.. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన తండ్రి... !...

మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్దామనుకున్నారు. కానీ అంబులెన్స్ ను అధిక డబ్బులు వసూలు చేస్తుండడంతో.. అది భరించలేక అదే మోటారుసైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !