వివాహితను తనతో రమ్మన్న ప్రియుడు.. నిరాకరించడంతో...

By AN TeluguFirst Published Aug 11, 2021, 11:09 AM IST
Highlights

పూజ నగరానికి వచ్చిన తరువాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్ బాద్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి  చేరుకున్నారు.

హైదరాబాద్ : వివాహితను ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కు చెందిన పూజ (21)కు అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ వర్మతో ఏ ఏడాది ఏప్రిల్ లో వివాహమయ్యింది. 

ఈ దంపతులు కొన్ని రోజుల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. జీడిమెట్ల డివిజన్ వినాయకనగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పూజ నగరానికి వచ్చిన తరువాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్ బాద్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి  చేరుకున్నారు.

రాకేష్ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తరువాత తనతో ధన్ బాద్ రావాలని పట్టుబట్టాడు. పూజ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను గమనించిన.. అదే ఇంట్లో ఉంటున్న రింకు అనే వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు.

మెదక్‌ కారులో డెడ్‌బాడీ మిస్టరీ చేధించిన పోలీసులు: ముగ్గురి అరెస్ట్

అయితే అడ్డువస్తే నీ కొడుకును చంపేస్తానని రాకేష్ బెదిరించాడు. ఆ తరువాత రాకేష్ తో ఝార్ఖండ్ నుంచి వచ్చిన యువకుడు పూజ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్ దిండుతో ఆమె ముఖం మీద పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత నిందితులిద్దరూ అక్కడ్నుంచి పరారయ్యారు. 

విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూజ భర్త రాజేంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.  

click me!