కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య !

Published : Sep 11, 2021, 09:16 AM IST
కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య !

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. హత్య చేశారు. ఈ ఘటన శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో చోటు చేసుకుంది.

శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. హత్య చేశారు. ఈ ఘటన శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన విషయం  తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మృతుడు మహాలింగాపురానికి చెందిన వెంకటయ్య (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలు హత్య జరగడానికి కారణాలేంటి? ఎవరు చంపారు? ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

SIR గడువు మరోసారి పొడిగింపు.. ఓటర్లకు ఈసీ కీలక అవకాశం, చివ‌రి తేదీ ఎప్పుడంటే
ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy