ప్రేమ పెళ్లి.. డెలివరీకి ఆస్పత్రికి తీసుకువెళ్లి..!

By telugu news teamFirst Published Aug 28, 2021, 12:20 PM IST
Highlights

ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే.. ఆమె ప్రేమించి పెళ్లాడటంతో కన్నవారు కూడా ఆమెను కాదన్నారు. 

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు.  అయితే.. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే.. ఆమె ప్రేమించి పెళ్లాడటంతో కన్నవారు కూడా ఆమెను కాదన్నారు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా అత్నూర్‌ మండలం మాధవరానికి చెందిన ఎం. ప్రియాంక, అదే మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ ప్రేమించి, గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఇరు పక్షాల పెద్దలు కాదనడంతో నగరానికి వచ్చి ఉప్పల్‌ చిలుకానగర్‌లో కాపురం పెట్టారు. నెలలు నిండిన ప్రియాంకను భర్త శ్రీనివాస్‌ ఈ నెల 15న కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించాడు. 16న ప్రియాంక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

17వ తేదీ నుంచి శ్రీనివాస్‌ కనిపించకుండా పోయాడు. దీంతో ప్రియాంక తన పసిబిడ్డతో ఆస్పత్రిలోనే ఉండిపోయింది. భర్త కనిపించడం లేదంటూ సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి రెండు వైపులా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రియాంక తల్లి, అక్క మహేశ్వరీలు ఆస్పత్రికి వచ్చారు. శ్రీనివాస్‌ శ్రీశైలంలోని ఓ సత్రంలో ఉన్నట్లు ఈనెల 26 న గుర్తించి అక్కడికి వెళ్లి, శుక్రవారం నగరానికి తీసుకువచ్చారు. పుట్టింట్లో ఉన్న ప్రియాంకకు అప్పగించారు. కాగా మొక్కు తీర్చుకునేందుకు శ్రీశైలం వెళ్లి అక్కడే సత్రంలో ఉండిపోయానని శ్రీనివాస్‌ పోలీసులకు చెప్పాడు

click me!