యువతిని వేధించాడని.. ఇంటికి పిలిచి, కొట్టి, చంపేసి.. మృతదేహాన్ని తగలబెట్టి.. !!

By AN TeluguFirst Published Sep 18, 2021, 12:03 PM IST
Highlights

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడకు చెందిన బురత్కర్ చైతన్య (22), 2018లో ఉపాధి శిక్షణ పొందుతున్న సమయంలో ఓ యువతిని వేధించేవాడు. ఆమెకు వివాహమైనా చైతన్య ఆగడాలు మానలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. ఈ నెల 9న ఆమె ద్వారా చైనత్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. 

ఆదిలాబాద్ : యువతిని వేధిస్తున్నాడని ఓ యువకుడిని ఆ మహిళ కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేసి.. కాల్చేసి పొదల్లో పడేశారు. ఈ హత్య ఘటనను పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర శుక్రవారం విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. 

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాకోడకు చెందిన బురత్కర్ చైతన్య (22), 2018లో ఉపాధి శిక్షణ పొందుతున్న సమయంలో ఓ యువతిని వేధించేవాడు. ఆమెకు వివాహమైనా చైతన్య ఆగడాలు మానలేదు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం.. ఈ నెల 9న ఆమె ద్వారా చైనత్యకు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. 

రాగానే ఏడుగురు కుటుంబ సభ్యులు అతడి మీద దాడి చేశారు. పార, కట్టెలతో కొట్టి ప్రాణాలు తీశారు. అనంతరం పరుపులో చుట్టి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు నటిస్తూ మృతదేహాన్ని ఆటోలో వేసుకుని బయటపడ్డారు. తోవలో పెట్రోలు కొని, తలమడుగు మండలం దేవాపూర్ శివారులో మృతదేహాన్ని తగలబెట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులు చైతన్య కనిపించడం లేదని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. 

దేవాపూర్ శివారులో కాలిన శవం గుర్తించిన తలమడుగు ఎస్ఐ దివ్యభారతి ఈ నెల 14న కేసు నమోదు చేశారు. జిల్లా ఇన్ ఛార్జి ఎస్పీ ప్రత్యేకంగా డీఎస్పీ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాలిన శవం చైతన్యదిగా నాలుగు రోజుల్లోనే పోలీసులు గుర్తించారు. 

శవం ఆనవాళ్లు, ఫోన్ వివరాలు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుల వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఏడుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. 

click me!