కొంపముంచిన బస్సు పరిచయం.. విటమిన్ మాత్రలని చెప్పి నిద్రమాత్రలు..

By AN TeluguFirst Published Feb 25, 2021, 4:24 PM IST
Highlights

బస్సు పరిచయం ఆ మహిళ కొంపముంచింది. కష్టపడి కొనుక్కున్న బంగారాన్ని దొంగల పాలు చేసింది. బస్సులో పరిచయమైన ఓ వ్యక్తి మహిళకు విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి నిద్రమాత్రలు ఇచ్చి, ఆమె ఇంట్లోని బంగారంతో ఉడాయించాడు. 

బస్సు పరిచయం ఆ మహిళ కొంపముంచింది. కష్టపడి కొనుక్కున్న బంగారాన్ని దొంగల పాలు చేసింది. బస్సులో పరిచయమైన ఓ వ్యక్తి మహిళకు విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి నిద్రమాత్రలు ఇచ్చి, ఆమె ఇంట్లోని బంగారంతో ఉడాయించాడు. 

హైదరాబాద్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ (36) ఎర్రగడ్డలో నివాసముంటుంది. ఈమెను గతంలో బస్సులో ఓ వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. తరచుగా బస్సులో కనిపిస్తుండడంతో ఫోన్లో మాట్లాడుకునేదాకా పరిచయం పెరిగింది.

ఈ క్రమంలో ఈ నెల 22న అతను మహిళ ఇంటికి వచ్చాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత తన దగ్గరున్న టాబ్లెట్స్ ఆమెకు ఇచ్చాడు. అవి విటమిన్ టాబ్లెట్స్ అని వేసుకుంటే నీరసం తగ్గుతుందని చెప్పాడు. నమ్మిన మహిళ వాటిని వేసుకుంది. 

కాసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. అంతే అనుకున్న ఎత్తు పారిందనుకున్న ఆ వ్యక్తి మహిళ ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారంతో ఉడాయించాడు. మెలుకువ వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

click me!