మద్యం అనుకొని యాసిడ్ తాగి ఒకరి మృతి

Published : May 12, 2019, 10:40 AM IST
మద్యం అనుకొని యాసిడ్ తాగి ఒకరి మృతి

సారాంశం

మద్యం అనుకొని యాసిడ్ తాగిన ఓ ప్రభుత్వ ఉద్యోగి  మృతి చెందాడు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది  

హైదరాబాద్: మద్యం అనుకొని యాసిడ్ తాగిన ఓ ప్రభుత్వ ఉద్యోగి  మృతి చెందాడు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది

సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన గణేష్ మింట్ కాంపౌండ్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా విదులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో మద్యం సేవించాడు.

మద్యం మత్తులోనే ఇంటికి చేరుకొన్నాడు. అయితే ఇంటికి వచ్చిన గణేష్ యాసిడ్‌ బాటిల్‌ను మద్యం బాటిల్‌గా భ్రమపడి యాసిడ్‌ను తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంసభ్యులకు అప్పగించారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?