పోలీసులను చూసి భయం.. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి...

Published : May 19, 2021, 03:41 PM IST
పోలీసులను చూసి భయం.. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి...

సారాంశం

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వస్తున్నారనే భయంతో బైక్ అదుపు తప్పి, అనిల్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. 

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వస్తున్నారనే భయంతో బైక్ అదుపు తప్పి, అనిల్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. 

కరీంనగర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్ మండలం ముంజంపల్లి బ్రిడ్జి పై నుండి అదుపు తప్పిన బైక్  కాలువలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లింగాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము అనిల్ యాదవ్ (19)సం"లు అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. 

మృతుడు ఇటీవలే ఓ ట్రాక్టర్ కొనుగోలు చేసి.. ఇసుకను  రవాణా చేస్తుండేవాడు.. ఈ రోజు కూడా అనిల్.. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు.. ముంజంపల్లి కాకతీయ కాలువ నుండి.. అనిల్ బైక్ పై ముందు వెళుతుండగా.. ట్రాక్టర్ వెనుకాల వస్తోంది. 

ఈ క్రమంలో... ఒక్కసారిగా పోలీసులు కనపడటంతో.. బైక్ లైట్ ఆఫ్ చేసిన అనిల్.. వేగం పెంచడంతో ఈ  ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu