కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్య

By narsimha lodeFirst Published Feb 26, 2021, 11:45 AM IST
Highlights

సూర్యాపేట జిల్లాలో కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పెద్ద చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది.

కోదాడ: సూర్యాపేట జిల్లాలో కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పెద్ద చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది.ఈ నెల 25 నుండి ప్రేమ జంట అదృశ్యమైంది.  దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవాళ ఉదయం చెరువులో  మృతదేహాలు నీళ్లలో పైకి తేలాయి.ఈ విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చెరువు నుండి బయటకు తీశారు. 

కోదాడ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మణికంఠ,  అదే గ్రామానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొన్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోననే భయంతో ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుల కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!