దారుణం: బావ మరిది కుటుంబానికి నిప్పు, ఐదుగురి పరిస్థితి విషమం

By narsimha lodeFirst Published Nov 22, 2019, 7:39 AM IST
Highlights

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. ఖమ్మంపల్లి గ్రామంలో లక్ష్మీరాజ్యం అనే వ్యక్తి బావమరిది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం ఖమ్మంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకొంది. కుటుంబ తగాదాలతో బావ మరిది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు బావ. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనలో విమల, సునీత, జాన్‌రాజ్, రాజేశ్వరీ, సునీతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిపై లక్ష్మీరాజ్యం పెట్రోల్ పోశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.భార్యతో గొడవ కారణంగానే లక్ష్మీరాజ్యం ఈ దారుణానికి పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

click me!