కామన్ సెన్స్ కూడా లేదు.. మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్

By ramya neerukondaFirst Published Jan 22, 2019, 11:30 AM IST
Highlights

కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై ఓ పత్రిక రాసిన వార్తపై కేటీఆర్ ఈ విధంగా మండిపడుతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం యాగం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం.. ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది.

కాగా.. ఈ న్యూస్ పై ఓ నెటిజన్.. కేసీఆర్ ప్రధాని పదవి కోసం యాగాలు చేయడం లేదని.. ఇలాంటి వార్తలు నిరాధారం అంటూ ట్వీట్ చేసి.. ఆ ట్వీట్ కి కేటీఆర్ ని కూడా ట్యాగ్ చేశారు.

దీంతో.. ఆ న్యూస్ పై కేటీఆర్ కూడా స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకోకుండా.. కామన్ సెన్స్ లేకుండా వార్తలు ప్రచురిస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నాంటూ ట్వీట్ చేశారు. 

Some news outlets don't seem to have the basic commonsense to do a fact check before publishing utter nonsense

Leave it to the wisdom of the respective editors https://t.co/Z94eiQrrXo

— KTR (@KTRTRS)

 

click me!
Last Updated Jan 22, 2019, 11:30 AM IST
click me!