దివంగత సీఎల్పీ మాజీనేత పి జనార్దన్రెడ్డి కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ టికెట్టును ఆశించిన సంగతి తెలిసిందే.
ఖైరతాబాద్ టికెట్ విషయంలో టీఆర్ఎస్ పార్టీలో తలెత్తిన అసమ్మతి జ్వాలలను ఆర్పేపనిలో పడ్డారు ఆ పార్టీ నేత కేటీఆర్. దివంగత సీఎల్పీ మాజీనేత పి జనార్దన్రెడ్డి కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ టికెట్టును ఆశించారు. అయితే.. మంత్రి కేటీఆర్తో చర్చల అనంతరం వెనక్కు తగ్గారు.
ఈ మధ్యే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్కు టికెట్టు ఖరారు చేయడంతో ఆమె రెబల్గా బరిలో ఉంటారని అందరూ భావించారు. రెబల్గా బరిలో దిగే విషయమై తమ అనుయాయులు, మద్దతుదారులతో చర్చించిన ఆమె మంత్రి కేటీఆర్ జోక్యంతో విరమించుకున్నారు. ఆ వెంటనే మాజీ మంత్రి దానం నాగేందర్ విజయారెడ్డి నివాసానికి వెళ్లి తనకు మద్దతు ప్రకటించాలని కోరడంతో ఆమె అంగీకరించారు.