రంగంలోకి కేటీఆర్.. వెనక్కి తగ్గిన విజయారెడ్డి

By ramya neerukondaFirst Published Nov 16, 2018, 11:05 AM IST
Highlights

దివంగత సీఎల్పీ మాజీనేత పి జనార్దన్‌రెడ్డి కూతురు, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్టును ఆశించిన సంగతి తెలిసిందే.

ఖైరతాబాద్ టికెట్ విషయంలో టీఆర్ఎస్ పార్టీలో తలెత్తిన అసమ్మతి జ్వాలలను ఆర్పేపనిలో పడ్డారు ఆ పార్టీ నేత కేటీఆర్. దివంగత సీఎల్పీ మాజీనేత పి జనార్దన్‌రెడ్డి కూతురు, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ టికెట్టును ఆశించారు. అయితే.. మంత్రి కేటీఆర్‌తో చర్చల అనంతరం వెనక్కు తగ్గారు. 

ఈ మధ్యే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు టికెట్టు ఖరారు చేయడంతో ఆమె రెబల్‌గా బరిలో ఉంటారని అందరూ భావించారు. రెబల్‌గా బరిలో దిగే విషయమై తమ అనుయాయులు, మద్దతుదారులతో చర్చించిన ఆమె మంత్రి కేటీఆర్‌ జోక్యంతో విరమించుకున్నారు. ఆ వెంటనే మాజీ మంత్రి దానం నాగేందర్‌ విజయారెడ్డి నివాసానికి వెళ్లి తనకు మద్దతు ప్రకటించాలని కోరడంతో ఆమె అంగీకరించారు.

click me!
Last Updated Nov 16, 2018, 11:05 AM IST
click me!