కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. లేఖ అందజేసిన కొన్ని నిమిషాల్లోనే..

Published : Aug 08, 2022, 11:27 AM ISTUpdated : Aug 08, 2022, 02:04 PM IST
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. లేఖ అందజేసిన కొన్ని నిమిషాల్లోనే..

సారాంశం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాకు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి సోమవారం శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. రాజీనామా లేఖను అందజేసిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో.. మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ గురించి త్వరలోనే ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. దీంతో నిబంధనల ప్రకారం మునుగోడు‌ శాసన సభ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వాహించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

స్పీకర్‌కు రాజీనామా లేఖను అందజేసి బయటకు వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని చెప్పారు. ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసేందుకు రాజగోపాల్‌ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. రాజీనామా అనంతరం రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలవనున్నారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

AP Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదానికి అసలు కారణమేంటి..? మంటలు ఎక్కడ, ఎలా మొదలయ్యాయి..?
Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu