ప్రభుత్వానికి అందిన నివేదిక.. తెలంగాణ వర్సిటీ వీసీపై త్వరలో వేటు..?

Siva Kodati |  
Published : Jun 16, 2023, 06:52 PM IST
ప్రభుత్వానికి అందిన నివేదిక.. తెలంగాణ వర్సిటీ వీసీపై త్వరలో వేటు..?

సారాంశం

తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ పై త్వరలో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీసీపై అనేక ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించినట్లుగా తెలుస్తోంది

తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ పై త్వరలో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైస్ ఛాన్సెలర్ అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందినట్లుగా సమాచారం. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లుగా ఆధారాలు సైతం అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీసీపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇదిలావుండగా.. బుధవారం తెలంగాణ వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. వేతనాలు కోరుతూ సిబ్బంది, ఆహారం లేక తాము పస్తులుండాల్సి వస్తోందని విద్యార్ధులు నిరసనకు దిగారు. సమస్యలను పరిష్కరించకుంటే రాజీనామా చేయాలని వారు వీసీని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కొందరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోని పూలకుండీలను ధ్వంసం చేశారు. దీనికి తోడు వీసీపై అనేక ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Update: రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హైఅలర్ట్
హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది