ముందస్తు సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన కేసీఆర్

Published : Dec 11, 2018, 10:53 AM ISTUpdated : Dec 11, 2018, 11:14 AM IST
ముందస్తు సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన  కేసీఆర్

సారాంశం

ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినవారు ఎవ్వరూ విజయం సాధించలేదు అనే ఓ సెంటిమెంట్ ఉండేది.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో.. టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు ఖరారైంది. దాదాపు 90 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం డిక్లేర్ అయిపోయింది. దీంతో.. ముందస్తు సెంటిమెంట్ కి కేసీఆర్ బ్రేకులు వేసినట్లే అనిపిస్తోంది.

ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినవారు ఎవ్వరూ విజయం సాధించలేదు అనే ఓ సెంటిమెంట్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 2003లో శాసనసభను ముందుగానే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల నిర్వహణకు కమిషన్ మార్చి వరకు సమయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుపై ఓడిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ముందస్తు ఎన్నికలు పాలక పార్టీకి కలిసి రావడం లేదనే సెంటిమెంట్ ఉంది.  అయితే.. ఈ సెంటిమెంట్ ని కేసీఆర్ అధిగమించారు. ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు.

ఇది మాత్రమే కాదు.. మరో సెంటిమెంట్ ని కూడా కేసీఆర్ ఈ ఎన్నికల్లో బ్రేకులు వేశారు. అదేదంటంటే.. గజ్వెల్ లో ఒక్కసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి గెలువలేదు. 1978 నుంచి ఇదే పరిస్థితి. 1978లో సైదయ్య అల్లం సాయిలుపై విజయం సాధించారు. 1983 ఎన్నికలకు వస్తే సాయిలు సైదయ్యపై విజయం సాధించారు. ఆ విధంగా చూస్తే కాంగ్రెసు సీనియర్ నేత జె. గీతారెడ్డికి కూడా ఓటమి తప్పలేదు.

2009లో తూముకుంట నర్సారెడ్డి గజ్వెల్ లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో నర్సారెడ్డి ఓడిపోయి కేసీఆర్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మహా కూటమి నుంచి కేసీఆర్ తో వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. అయితే.. ఇక్కడ కూడా కేసీఆర్ విజయం దాదాపు ఖరారైంది. దాదాపు 15వేల ఓట్ల తేడాతో కేసీఆర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu