ఊరంతా పండుగ, ఆకుటుంబంలో విషాదం: జగిత్యాలలో దారుణం

Published : Oct 07, 2019, 10:39 AM ISTUpdated : Oct 07, 2019, 10:40 AM IST
ఊరంతా పండుగ, ఆకుటుంబంలో విషాదం: జగిత్యాలలో దారుణం

సారాంశం

వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 

జగిత్యాల: దేవీ శరన్నవత్రుల సందర్భంగా ఊరువాడ అంతా సంబంరంగా ఉంటే ఆ ఇంట్లో మాత్రం విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. పండుగపూట కుటంబ సభ్యులతో గడపాలని భావించిన రైతులు వేకువ జామునే పొలానికి వెళ్లిన వారు శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో రోదనలు అన్నీ ఇన్నీ కావు. 

వివరాల్లోకి వెళ్తే వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. గుర్రం అజయ్ రెడ్డి, ముస్కు రాజిరెడ్డిలు పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందర్నీ కలచి వేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విద్యుత్ షాక్ తోనే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో నిర్థారించారు.  

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?