పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈజీకాదు.. జగ్గారెడ్డి

By AN TeluguFirst Published Feb 6, 2021, 10:04 AM IST
Highlights

పంట పండించడం అంటే సిక్స్ కొట్టినంత ఈజీకాదు అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీతారలు కంగనా, అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్ లాంటివారు ఒక్కసారి కూడా నాగలి పట్టి, దుక్కి దున్ని.. విత్తనాలేసి పంట పండించలేదు. 

పంట పండించడం అంటే సిక్స్ కొట్టినంత ఈజీకాదు అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీతారలు కంగనా, అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్ లాంటివారు ఒక్కసారి కూడా నాగలి పట్టి, దుక్కి దున్ని.. విత్తనాలేసి పంట పండించలేదు. 

పంట పండించడం అంటే క్రికెట్‌ ఆడినంత ఈజీ కాదు, సినిమాల్లో డైలాగ్స్ చెప్పి, డ్యాన్సులు చేసినంత సులువు కాదు. రైతుల గురించి, వారు చేస్తున్న ఉద్యమం గురించి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి.. అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సెలబ్రిటీలకు హితవు పలికారు.

రైతులు పండించిన పంట తింటూ వారి పోరాటాన్నే వ్యతిరేకిస్తూ కొందరు సినీ తారలు, క్రికెటర్లు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమని శుక్రవారం ఓ ప్రకటనలో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
సినీ పరిశ్రమలో, క్రికెట్లో కాస్త విరామం దొరుకుతుంది. వారు ఆడుతున్నా, నటిస్తున్నా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ నాగలి పట్టి భూమి దున్నే రైతులకు అలాంటిదేమీ ఉండదు. మన దేశ రైతులకు పరాయి దేశస్తులు మద్దతిస్తుంటే.. దాన్ని చూసైనా తెలుసుకోకుండా, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సెలబ్రిటీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటూ దుయ్యబట్టారు. 

click me!