
భారత వాతావరణ శాఖ (IMD) తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మరియు వర్షాలు కలగలిపిన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశముంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలు, సాయంత్రం ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ప్రమాదం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.