రవిప్రకాష్‌కు ఊరట: బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Published : Jul 12, 2019, 02:29 PM ISTUpdated : Jul 12, 2019, 02:30 PM IST
రవిప్రకాష్‌కు ఊరట: బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

సారాంశం

టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.


హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.

టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లపై రవిప్రకాష్ ఇప్పటికే  హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.తనపై నమోదైన కేసుల విషయమై గత మాసంలో  ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?