వచ్చే నెలలో గజ్వేల్ కి వస్తానని అడ్డం వచ్చినవారిని తొక్కుకొంటూ వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడు చింతలపల్లిలో ఆయన 48 గంటల దీక్షను ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్: వచ్చే నెలలో గజ్వేల్ గడ్డ మీదికి వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అడ్డం వచ్చే టీఆర్ఎస్ శ్రేణులను తొక్కుకుంటూ వెళ్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ అలా చేయకపోతే అక్కడే గుండు గీయించుకొంటానని ఆయన ప్రకటించారు.
also read:అలా అయితే రాజీనామా చేస్తా, చర్చకు సిద్దమా?: మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్షలో రేవంత్
కేసీఆర్ దత్తత తీసుకొన్న మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దీక్షను మంగళవారం నాడు ప్రారంభించారు. 48 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారు. తాను ఈ దత్తత గ్రామాల్లోకి రాకుండా ఉండాలని కొందరితో తనపై విమర్శలు చేయించాడని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ విమర్శలపై తాను ఇక్కడి నుండి మాట్లాడేందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఆయన చెప్పారు.
తనపై విమర్శలు చేసిన గ్రామాలకు రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు పన్నాగం పన్నారన్నారు. ఫామ్హౌస్ పక్కకు వచ్చి ఈ విమర్శలకు సమాధానం చెప్పేందుకే తాను ఇంతకాలం నోరు తెరవలేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకొన్నా ఈ గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ జెండాకే అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.