నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నౌకరీ డాట్ కామ్ ద్వారా నిరుద్యోగులకు ఈ ముఠా గాలం వేసింది. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను బురిడీ కొట్టించింది. ఉద్యోగాల కోసం వందలాది మంది యువత ధరఖాస్తు చేసుకొన్నారు.
ధరఖాస్తు చేసుకొన్న వారికి ఫోన్లు చేసి ఈ ముఠా డబ్బులు వసూలు చేసింది. లక్నోలో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఫోన్లు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. లక్నోలోని కాల్ సెంటర్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠాలోని ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.