హైదరాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ : హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేటెడ్

By AN TeluguFirst Published Mar 20, 2021, 10:59 AM IST
Highlights

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్ అయ్యారు.  హర్షవర్ధన్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.  హర్షవర్ధన్ రెడ్డి ఓట్లలో బీజేపీకి 928 ఓట్లు వచ్చాయి. వానీదేవి మెుత్తం ఓట్లు - 1,19,619, రామచంద్రరావు మొత్తం ఓట్లు - 1,10,500 గా ఉన్నాయి.  టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 9,119 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేటెడ్ అయ్యారు.  హర్షవర్ధన్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.  హర్షవర్ధన్ రెడ్డి ఓట్లలో బీజేపీకి 928 ఓట్లు వచ్చాయి. వానీదేవి మెుత్తం ఓట్లు - 1,19,619, రామచంద్రరావు మొత్తం ఓట్లు - 1,10,500 గా ఉన్నాయి.  టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 9,119 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

ఇదిలా ఉండగా తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వేగం పెంచాలని శుక్రవారం ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా టేబుల్స్ సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. కౌంటింగ్ ఏజెంట్లను సమకూర్చుకోవాలని అభ్యర్ధులకు సూచించారు అధికారులు. ప్రస్తుతం ఒకే టేబుల్‌పై ఎలిమినేషన్ అభ్యర్ధుల ఓట్లను లెక్కిస్తున్నారు. 

హైదరాబాద్ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,13,015, బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు 1,04,960, ఇండిపెండెంట్ అభ్యర్ధి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు 53,792, కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డికి 31,710 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో ఇప్పటి వరకు 40 మంది అభ్యర్ధులు ఎలిమినేట్ అయ్యారు. 

నల్గొండ విషయానికి వస్తే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 55 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,11,190, తీన్మార్ మల్లన్న 83,629, కోదండరామ్ 70,472, బీజేపీ 39,268, కాంగ్రెస్ 27,713, లెఫ్ల్ 9,657, చెరుకు సుధాకర్ 7,903 ఓట్లు పోలయ్యాయి. 

click me!