హైదరాబాద్ లో దారుణం.. కొడుకును చంపిన సవతి తల్లి..!

By telugu news teamFirst Published May 23, 2022, 11:39 AM IST
Highlights

ఉజ్వల్ అనే ఏడేళ్ల బాలుడు 15 రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడ్డాడు. వెంటనే తండ్రి బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు.

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ.. సవతి కొడుకును అతి దారుణంగా చంపేసింది. నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో ఈ దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది. ఉజ్వల్ అనే ఏడేళ్ల బాలుడు 15 రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడ్డాడు. వెంటనే తండ్రి బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. ఆ తరువాత ఇంటికి తీసుకురాగా... నిన్న(ఆదివారం) బాలుడు ఇంట్లో చనిపోయాడు.

 బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి సరిత కొడుకును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బిల్డింగ్‌పై నుండి ఉజ్వల్‌ను సవతి తల్లి నెట్టివేసింది.ఈ విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిల్డింగ్ పై నుంచి తోసేసిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందికి ఇంటికి వచ్చాడు. పై నుంచి తోసినా.. చనిపోకపోవడంతో ఇంటికి వచ్చిన తరువాత గొంతు నులిమి హత్య చేసింది. కాగా.. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసిన పోలీసులు.. సరితను అరెస్టు చేసి కాచిగూడ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

click me!