
హైదరాబాద్: Secunderabad బోయిగూడ అగ్ని ప్రమాదానికి సంబందించి అగ్నిమాపక సిబ్బంది తమ విచారణలో కీలక విషయాలను గుర్తించారు. ఫైరింజన్లు రావడానికి ముందే 11 మంది మరనించారని సిటీ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్పారు.
ఈ ఏడాది మార్చి 23న సికింద్రాబాద్ Bhoigudaలోని స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ నెల 23వ తేదీ తెల్లవారుజాము మూడు గంటలకు షార్ట్ సర్క్యూట్ తో Fire accident జరిగిందని అగ్నిమాపక శాఖాధికారులు గుర్తించారు. అయితే అగ్నిమాపక శాఖకు మాత్రం తెల్లవారుజామున 3:55 గంటలకు సమాచారం అందిందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్పారు.
ఈ సమాచారం అందుకొని ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలను మొదలు పెట్టాయి.అయితే ఈ godownనే 11 మంది ఉంటున్నారనే విషయాన్ని ఫైర్ సిబ్బందికి చెప్పలేదని ఫైర్ ఆఫీసర్ Srinivas చెప్పారు.
Scrap గోడౌన్లో కేబుల్స్, పేపర్లు ఉండడంతో మంటలు త్వరంగా అంటుకొన్నాయని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ మంటల ధాటికి పెద్ద ఎత్తున కార్బన్ మోనాక్సైడ్ విడుదలైందని అగ్నిమాపక శాఖాధికారులు చెప్పారు. గోడౌన్ ఫస్ట్ ఫ్లోర్లో నిద్రపోతున్న వారంతా ఈ కార్బన్ మోనాక్సైడ్ పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి సజీవ దహనమయ్యారని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ చెప్పారు.11 మంది ఒకరిపై మరొకరు పడి సజీవ దహనమయ్యారని ఫైర్ సేఫ్టీ అధికారి వివరించారు.
ఫస్ట్ప్లోర్లో 11 మంది ఉన్నారనే విషయాన్ని తమ సిబ్బందికి ముందుగానే సమాచారం ఇస్తే వారిని కాపాడే ప్రయత్నం చేసే వాళ్లమని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రమాదం నుండి గాయాలతో బయటపడిన ప్రేమ్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తమ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్ లోకి వెఁళ్లి చూస్తే అప్పటికే 11 మంది సజీవ దహనమయ్యారని శ్రీనివాస్ వివరించారు.