ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ దీక్షలు: అనుమతి ఇవ్వని పోలీసులు

Published : Oct 07, 2019, 07:24 AM ISTUpdated : Oct 07, 2019, 10:20 AM IST
ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ దీక్షలు: అనుమతి ఇవ్వని పోలీసులు

సారాంశం

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద సోమవారం నాడు తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీక్ష కోసం వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని  పోలీసు శాఖ ప్రకటించింది.

హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నాడు ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. మరో వైపు తాము దీక్షను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది.

ఇందిరాపార్క్ వద్ద తాము తలపెట్టిన నిరహారదీక్షకు మద్దతివ్వాలని పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను ఆర్టీసీ జేఎసీ కోరింది. ఈ మేరకు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ జేఎసీకి మద్దతుగా నిలిచాయి.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ఆదివారం నాడు రాత్రి ప్రకటించారు. దీంతో సోమవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరహారదీక్షకు దిగనున్నారు.

ఇందిరా పార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించడంతో పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావాన్ని తెలిపాయి. దీంతో ఇందిరాపార్క్ వద్ద దీక్ష ఎలా సాగుతోందనే ఉత్కంఠ నెలకొంది.


 

PREV
click me!

Recommended Stories

Holiday: ఫిబ్ర‌వ‌రి 11న సెల‌వు.. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేట్ సంస్థ‌ల‌న్నీ బంద్‌. ఎందుకంటే.?
IMD Rain Alert : ఫిబ్రవరి, మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వీటిని మ్యాంగో షవర్స్ ఎందుకంటారో తెలుసా..?